కేంద్ర ప్రభుత్వం రైతుల కొరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే స్కీమ్ ను ప్రవేశపెట్టింది. అయితే ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏటా అర్హులైన రైతులకు రూ.6,000/- ఆర్ధిక సహాయం అంధిస్తుంది.
అయితే ఈ స్కీమ్ కు సంబంధించి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఒక ఇంస్టాల్ మెంట్ అంటే రూ.2,000/- చొప్పున ఆర్ధిక సహాయం ను అర్హులైన రైతు బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది.
పి యం కిసాన్ పథకం కింద గ్రామాల వారీగా బెనిఫీసియరి లిస్ట్ ను ఎలా తనిఖీ చేయాలో ఈ క్రింద తెలుపడమైనది.
✅ ముందుగా పి యం కిసాన్ యొక్క అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి
✅ హోం పేజీలో ఉన్న Farmer Corner లోని Beneficiary List అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
✅ ఆ తర్వాత మీకు కావల్సిన రాష్ట్రాన్ని, జిల్లాని, ఉప జిల్లా, బ్లాక్ మరియు గ్రామాన్ని ఎంచుకొని Get Report పై క్లిక్ చేస్తే మీరు ఎంచుకున్న గ్రామంలోని పి యం కిసాన్ యొక్క లబ్ధి దారుల వివరాలు అనేవి మీకు స్క్రీన్ పై కనిపిస్తాయి.