ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు ప్రభుత్వం రైతు భరోసా, ఈ-క్రాప్, వై యస్ ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు ఇలా అనేక పథకాలను ప్రవేసపెట్టింది. అయితే వై యస్ ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించి రబీ, ఖరీఫ్ సీజన్లలో రూ. లక్షలోపు పంట రుణం తీసుకొని సకాలంలో తిరిగి చెల్లించిన రైతులకు అలాగే అర్హులైన ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వై యస్ ఆర్ సున్నా వడ్డీ రాయితీని జమ చేస్తుంది.
అయితే ఈ అర్హుల జాబితాను రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శించడం జరుగుతుంది. అయితే ఈ-క్రాప్ లో నమోదు అయిన పంట వివరాల ఆధారంగా ప్రభుత్వం వడ్డీ రాయితీని అర్హులైన రైతులకు అందించనుంది.
✅ ముందుగా మీరు వై యస్ ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు యొక్క అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
✅ హోం పేజిలో ఉన్న మెనూ బార్ లో Know Your Status పై క్లిక్ చేయాలి.
✅ ఆ తర్వాత Crop Year ను మరియు Crop Season ను ఎంచుకొని అలాగే లబ్దిదారుని యొక్క ఆధార్ నెంబర్ ను నమోదు చేసి SUBMIT పై క్లిక్ చేస్తే వై యస్ ఆర్ సున్నా వడ్డీ పంట రుణంకు సంబంధించి వడ్డీ రాయితీ వివరాలు అనేవి మీకు స్క్రీన్ పైన కనిపిస్తాయి.