Pradhan Mantri Kisan Samman Nidhi Yojana:- కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పి యం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ప్రతి ఏటా రూ. 6,000 లను మూడు విడతల చొప్పున అర్హులైన ప్రతి రైతుకు లబ్ది చేకూరుతుంది. అయితే ఈ పి యం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద లబ్ది దారుని యొక్క బెనిఫీసియరి స్టేటస్ అనేది ఈ కింద తెలిపిన విధముగా తెలుసుకోవచ్చును.
ముందుగా మీరు పి యం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
ఆ తర్వాత Farmers Corner లో ఉన్న Beneficiary Status పై క్లిక్ చేయాలి.
ఇక్కడ బెనిఫీసియరి స్టేటస్ అనేది రెండు విధాలుగా కనుగొనవచ్చును. అవి
- Mobile Number
- Registration Number
మీరు మీ యొక్క పి యం కిసాన్ అకౌంట్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ను ఎంటర్ చేసి మరియు క్యాప్త్చ కోడ్ ని ఎంటర్ చేసి Get Data పై క్లిక్ చేస్తే లబ్ది దారుని బెనిఫీసియరి స్టేటస్ అనేది స్క్రీన్ పైన కనిపిస్తుంది.