ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజల కొరకు వై యస్ ఆర్ రైతు భరోసా, క్రాప్ ఇన్సురెన్స్, ఈబీసి నేస్తం, వై యస్ ఆర్ చేయూత, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వై యస్ ఆర్ కాపు నేస్తం, వై యస్ ఆర్ జలకల, వై యస్ ఆర్ ఆసరా, జగనన్న తోడు ఇలా అనేక పథకాలను అమలు చేసింది.
అయితే చాలా మంది ప్రజలకు వారికి ఎలాంటి పతకాలు వర్తిస్తాయో? తెలియదు. అయితే ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా ఎవరికి ఎలాంటి పథకం వర్తిస్తుంది అనే విషయాన్ని సులభంగా మనమే ఆన్లైన్ లో నవశకం బెనిఫీసియరి మేనేజ్ మెంట్ యొక్క అధికారిక పోర్టల్ తెలుసుకొనే సదుపాయాన్ని ప్రభుత్వం కలిపించింది.
ఈ నవశకం బెనిఫీసియరి మేనేజ్ మెంట్ యొక్క అధికారిక పోర్టల్ ద్వార మనకు ఎటువంటి పథకం వర్తిస్తుంది అనే విషయాన్నిఅతి సులభంగా ఇలా తెలుసుకోండి.
✅ ముందుగా Navasakam Beneficiary Management (GSWS-NBM) యొక్క అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించండి.
✅ ఆ తర్వాత హోం పేజిలో కనిపిస్తున్న Scheme Eligibility పై క్లిక్ చేయాలి.
✅ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి, Scheme Type ని ఎంచుకొని మీరు ఏ ఆర్ధిక సంవత్సరానికి అయితే Scheme Eligibility చెక్ చేయాలి అని అనుకుంటున్నారో! ఆ సంవత్సరాన్ని ఎంచుకొని Get Details పై క్లిక్ చేయాలి.
✅ Mobile Number Authentication కొరకు మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి, అలాగే కాప్త్చ కోడ్ ని ఎంటర్ చేసి SEND OTP పై క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఓటిపి వస్తుంది.
✅ మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటిపిని ఎంటర్ చేసి VERIFY OTP క్లిక్ చేస్తే, మీరు ఎంచుకున్న పథకానికి మీరు ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్ కి అర్హతలు ఏమేమి ఉన్నాయో! ఆ వివరాలు అన్ని మీకు స్క్రీన్ పై కనిపిస్తాయి.