ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల కోసం ముఖ్యమంత్రి అయిన శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు అందరూ లబ్ది పొందాలని అనేక పథకాలను అమలు చేస్తున్నాడు. అయితే రాష్ట్రంలోని మహిళలకు కోసం కూడా ఎన్నో రకాలైన పథకాలను తీసుకువచ్చాడు. మహిళల కోసం తీసుకువచ్చిన పథకాలలో వై యస్ ఆర్ చేయూత అనేది కూడా ఒక పథకం.
ఈ పథకం ద్వార అర్హులైన ప్రతి మహిళకు ప్రతి ఏడాదికి ఒకసారి రూ.18,750 లను లబ్ది చేకూరుతుంది. ఇలా ఏడాదికి రూ. 18,750 చొప్పున మొత్తంగా నాలుగు సంవత్సరాల వ్యవధిలో రూ. 75 వేల రూపాయల ఆర్ధిక సాయం అనేది లభిస్తుంది.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటి మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
- 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- దరఖాస్తు చేసుకున్న వారి కుటుంబంలో ఎవరూ కూడా ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఉండకూడదు మరియు ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్ తీసుకునే వారు అయ్యి ఉండకూడదు.
- కుటుంబం మొత్తం మీద మాగాణి భూమి అయితే 3 ఎకరాలు లేదా మెట్ట భూమి అయితే 10 ఎకరాల లోపు ఉండాలి లేదా మాగాణి మరియు మెట్ట భూమి రెండు కలిపి కూడా 10 ఎకరాల లోపు ఉండాలి.
- కుటుంబం మొత్తం ఆదాయం కలిపి గ్రామీణ ప్రాంతాలలో అయితే రూ. 10వేలు మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ.12వేలకు మించరాదు.
- అప్లికేషను ఫారం
- ఆధార్ కార్డు
- బ్యాంకు అకౌంట్
- కుల దృవీకరణ పత్రం
- ఆదాయ దృవీకరణ పత్రం
- మొబైల్ నెంబర్
- పాస్ ఫోటో
వై యస్ ఆర్ చేయూత పథకం కొరకు దరఖాస్తు చేసుకోవాలంటే మీ గ్రామ వాలంటీర్ ను సంప్రదించడం ద్వార వారు మీ యొక్క వివరాలను వై యస్ ఆర్ చేయూత మొబైల్ యాప్ నందు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే గ్రామ వాలంటీర్ ద్వార నమోదు చేయబడిన సమాచారాన్ని గ్రామ/వార్డ్ సంక్షేమ సెక్రటరీ గారు మరొక సారి పరిశీలించి వెరిఫై చేయడం జరుగుతుంది.
ఈ పథకం గురుంచి మరిన్ని వివరాల కొరకు మీ గ్రామ వాలంటీర్ లేదా దగ్గరలోని గ్రామ సచివాలయంను సంప్రదించండి.