ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి అయిన శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం అనేక రకాలైన పథకాలు అనేవి అమలు చేస్తున్నాడు. అయితే ఆ పథకాలలో ఈ వై యస్ ఆర్ వాహన మిత్ర పథకం కూడా ఒకటి.
ఈ పథకం ద్వార సొంతంగా ట్యాక్సీ, ఆటో అలాగే మ్యాక్సీ క్యాబ్ నడుపుకుంటున్న వారికి ఆర్దిక సహాయం కింద ఏటా రూ.10,000 లను లభ్ది చేకూరుతుంది.
- దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ నివాసి అయ్యి ఉండాలి.
- తప్పనిసరిగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- పేద కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
- ట్యాక్సీ, ఆటో లేదా మ్యక్సీ క్యాబ్ దరఖాస్తు దారుడి పేరు మీద మరియు ఆంధ్రప్రదేశ్ రవాణ శాఖలో మాత్రమే రిజిస్టర్ అయ్యి ఉండాలి.
- లబ్దిదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- బ్యాంక్ అకౌంట్
- కుల దృవీకరణ పత్రం
- వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
- డ్రైవింగ్ లైసెన్స్
వై యస్ ఆర్ వాహన మిత్ర పథకం దరఖాస్తు కొరకు ఆంధ్రప్రదేశ్ యొక్క రవాణ అధికారిక వెబ్ సైట్ ద్వార మీరే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా మీకు దగ్గరలోని గ్రామ సచివాలయం లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కొరకు మీకు దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయం ను సంప్రదించండి.