ఆడ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేసపెట్టిన పథకాలలో ఈ సుకన్య సమృద్ది యోజన పథకం అనేది ఒకటి. ఈ పథకం అనేది కేవలం ఆడ పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. ఇంట్లో ఇద్దరు ఆడ పిల్లలు ఉన్న ఈ పథకంలో ఇద్దరూ చేరవచ్చు.
ఈ సుకన్య సమృద్ది యోజన పథకం అనేది తల్లిదండ్రులు వారి ఆడ పిల్లల భవిష్యత్ కోసం డబ్బును పొదుపు చేసుకోవడంలో సహాయపడే ఒక కేంద్ర ప్రభుత్వ పథకం. అయితే ఈ పథకంలో చేరాలంటే ముఖ్యంగా పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి.
అయితే ఈ పథకంలో చేరిన వాళ్ళు ప్రతి నెల కనీసం రూ.250 రూపాయలు అయిన డిపాజిట్ చేస్తూవుండాలి. ఇలా ఆడ పిల్లకు 21 సంవత్సరాలు వచ్చే వరకు డిపాజిట్ చేస్తువుండాలి. ఎప్పుడు అయితే 21 సంవత్సరాలు నిండుతాయో అప్పుడు మాత్రం డిపాజిట్ అమౌంట్ మొత్తం మరియు వడ్డీ మొత్తాన్ని కలిపి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది.
- తప్పనిసరిగా భారతీయులు అయ్యి ఉండాలి.
- పుట్టిన రోజు నుండి 10 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్న ప్రతి ఆడ పిల్ల ఈ పథకంలో చేరవచ్చు.
- ఒక కుటుంబంలో అత్యధికంగా ఇద్దరు ఆడ పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
- దరఖాస్తు దారుని ఆధార్ కార్డు
- బర్త్ సర్టిఫికేట్
- రెండు పాస్ ఫోటోలు
- కనీసం రూ.250/- డిపాజిట్ చేయాలి.
- అత్యధికంగా రూ.1,50,000/- వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.
సుకన్య సమృద్ది యోజన పథకంలో చేరాలంటే సంబంధిత పత్రాలు తీసుకొని మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో కాని లేదా బ్యాంకులో కాని దరఖాస్తు చేసుకోవచ్చు.
Note: ఈ సుకన్య సమృద్ది యోజన పథకం గురించి మరిన్ని వివరాల కొరకు దగ్గరలోని బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించండి.