ఆంధ్రప్రదేశ్ లోని ఓసి వర్గాలకు చెందిన ఆర్దికంగా వెనుకబడిన మహిళల కోసం శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు వై యస్ ఆర్ ఈబీసి నేస్తం అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వార అర్హత కలిగిన మహిళలకు ప్రతి సంవత్సరానికి ఒకసారి రూ. 15వేల చొప్పున ఆర్దిక సాయాన్ని అందిస్తున్నారు.
అయితే ఏడాదికి రూ. 15వేల చొప్పున మూడు సంవత్సరాల పాటు రూ. 45వేల రూపాయలను అర్హత కలిగి దరఖాస్తు చేసుకున్న మహిళల బ్యాంకు ఖాతాలలో నేరుగా డబ్బును జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
- 45 ఏళ్ల నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- వై యస్ ఆర్ చేయూత మరియు కాపు నేస్తం ఇలాంటి పథకాలలో లబ్దిదారులు అయ్యి ఉండకూడదు.
- ఈబీసి మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది.
- కుటుంబంలో ఎవరూ కూడా ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండకూడదు. అలాగే కుటుంబంలో ఎవరు కూడా ఆదాయపు పన్ను చెల్లించకూడదు.
- ఇక పొలం విషయానికి వస్తే కుటుంబం మొత్తం మీద మెట్ట భూమి అయితే 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి అలాగే మాగాణి భూమి మాత్రం 3 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. మెట్ట మరియు మాగాణి భూమి రెండూ కూడా 10 ఎకరాల కంటే తక్కువగా ఉండాలి.
- ఈ పథకంలో లబ్ది పొందాలనుకునే వారి కుటుంబ వార్షిక ఆదాయం అనేది గ్రామాల్లో అయితే నెలకు రూ.10 వేలు మరియు పట్టణాల్లో అయితే నెలకు రూ. 12 వేల రూపాయలకు మించకూడదు.
- ఆధార్ కార్డు
- బ్యాంకు అకౌంట్
- కుల దృవీకరణ పత్రం
- ఆదాయపు దృవీకరణ పత్రం
అర్హత కలిగిన మహిళలు ఈ వై యస్ ఆర్ ఈబీసి పథకం కొరకు దరఖాస్తు చేసువాలన్న మరియు పథకం గురుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్న మీకు దగ్గరలోని గ్రామ సచివాలయంను సంప్రదించండి.