భారతదేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాలైన పథకాలను తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పౌరులలో డిజిటల్ అక్షరాస్యత పెంచడానికి ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ అనే పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం సీ ఎస్ సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ వారిచే అమలచేయబడింది.
అయితే ఈ పథకం ద్వార అర్హత కలిగిన ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేయడం వలన డిజిటల్ అక్షరాస్యత అనేది పెరుగుతుంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలకు మొబైల్ ఫోన్, కంప్యూటర్ లేదా డిజిటల్ యాక్సెస్ కలిగిన పరికరాలను ఎలా ఉపయోగించాలి అనే అంశం పై అవగాహన కలిపించటం అలాగే ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, ఈ-మెయిల్స్ పంపించడమ మరియు అందుకోవడం, డిజిటల్ చెల్లింపులు చేపట్టడం, సమాచారం కొరకు వెతకడం మొదలైన వాటి పైన శిక్షణ కలిపిస్తారు.
- లబ్దిదారులు డిజిటల్ గా నిరక్షరాస్యులు అయ్యి ఉండాలి.
- వయస్సు అనేది 14 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- అలాగే అర్హత కలిగిన కుటుంబం నుండి ఒక వ్యక్తి మాత్రమే శిక్షణకు అర్హులు అవుతారు.
స్మార్ట్ ఫోన్ ఉపయోగించని వారు, కాలేజి డ్రాప్ అవుట్స్ విద్యార్దులకు, అంత్యోదయ కుటుంబాలకు, ఎస్సీ, ఎస్టి, మైనారిటి, వికలాంగులు మరియు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
- ఆధార్ కార్డు
- మొబైల్ నెంబర్
- ఈ-మెయిల్ ఐడి
- పాస్ ఫోటో
ఈ పథకంలో చేరాలంటే మీకు దగ్గరలోని CSC (Common Service Center) ను సంప్రదించండి. అక్కడ CSC VLE'S మిమ్మల్ని ఈ పథకంలో రిజిస్టర్ చేసి మీకు శిక్షణ కల్పించి, శిక్షణ పూర్తి అయ్యినట్లు సర్టిఫికేట్ జారీ చేస్తారు.
మాడ్యుల్ పేరు |
---|
1. డిజిటల్ పరికరాల పరిచయం |
2. ఆపరేటింగ్ డిజిటల్ పరికరాలు |
3. ఇంటర్నెట్ పరిచయం |
4. ఇంటర్నెట్ ఉపయోగించి కమ్మ్యునికేషన్లు |
5. ఇంటర్నెట్ అప్లికేషన్లు (పౌరుల-కేంద్రీకృత సేవలు: నగదు రహిత లావాదేవీలను చేపట్టేందుకు డిజిటల్ ఆర్ధిక సాధనాల ఉపయోగం) |
మొత్తం వ్యవధి: 20 గంటలు |
✅ ముందుగా మీరు ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ యొక్క అధికారిక PMGDISHA వెబ్ సైట్ ను సందర్శించండి.
✅ వెబ్ పేజిని కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే శిక్షణ కేంద్రం వద్ద SEARCH NOW బటన్ కనిపిస్తుంది, అప్పుడు దానిపైన క్లిక్ చేయాలి.
✅ ఆ తర్వాత మీ రాష్ట్రం, జిల్లా మరియు మండలంను ఎంచుకొని GO బటన్ పై క్లిక్ చేస్తే మీ మండలంలో ఉన్న శిక్షణ కేంద్రాలు అన్ని స్క్రీన్ పై చూపిస్తున్నాయి .