రైస్ కార్డులో ఉన్న ప్రతి లబ్దిదారుడు ఈ-కేవైసి తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది. ఈ-కేవైసి నమోదు చేసే ప్రక్రియలో వ్రేలు ముద్రలు పడకపోతే దగ్గరలో ఉన్న ఆధార్ సేవ కేంద్రం వద్ద అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే మీరు ఈ-కేవైసి నమోదు చేసుకున్నారా..లేదా అని మీకు సందేహంగా ఉన్నదా? అయితే ఈ కింద తెలిపిన విధముగా మీ రైస్ కార్డులో మీకు ఈ- కేవైసి నమోదు అయ్యిందా.. లేదా? అని మీరే తెలుసుకోండి.
✅ ముందుగా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ https://epds1.ap.gov.in/epdsAP/epds పై క్లిక్ చేయాలి. తర్వాత మెనూ బార్ లో ఉన్న DASH BOARD అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
✅ రేషన్ కార్డు కేటగిరీలో ఉన్న EPDS APPLICATION SEARCH పైన క్లిక్ చేయాలి.
✅ Enter Application Id బాక్స్ లో మీ యొక్క కొత్త రేషన్ కార్డు నెంబర్ ని అక్కడ ఎంటర్ చేసి మరియు కాప్త్చని ఎంటర్ చేసి Search బటన్ పై క్లిక్ చేయండి.
✅ ఆ తర్వాత రైస్ కార్డులో ఉన్న అందరి పేర్లు మరియు ఈ-కేవైసి స్టేటస్ అనేది అక్కడ మీకు స్క్రీన్ పైన కనపడుతుంది. అక్కడ ఈ-కేవైసి ఆప్షన్ లో Success అని ఉంటే మీకు ఈ-కేవైసి అనేది పూర్తి అయ్యినట్లు. ఒకవేళ Parental Authentication అని ఉంటే ఇంకా ఈ-కేవైసి పూర్తి కాలేదు అని అర్ధం.