తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరూ లేని 1 నుండి 18 సంవత్సరాల మధ్య గల వయసు ఉన్న పిల్లలకు వారి యొక్క అభివృద్ధి కొరకు కొంత ఆర్ధిక సహాయం అంది౦చడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం పేరే మిషన్ వాత్సల్య.
అయితే ఈ మిషన్ వాత్సల్య పథకంకి సంబంధించి స్పాన్సర్ షిప్ కార్యక్రమం అనేది బాలుడు లేదా బాలిక దరఖాస్తు చేసుకున్న సమయం నుండి 18 సంవత్సరాలు నిండే వరకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
ఈ పథకంలో అర్హత పొందిన పిల్లలకు నెలకు రూ. 4,000/- లను ప్రభుత్వం అందించడం జరుగుతుంది.
✅ తల్లి లేదా తండ్రి లేదా తల్లి తండ్రి ఇద్దరూ లేని అనాధ పిల్లలు అయ్యి ఉండాలి.
✅ గ్రామీణ ప్రాంతంలో నివసించే వారి యొక్క సంవత్సర కుటుంబ ఆధాయం అనేది రూ. 72 వేల కంటే మించరాదు.
✅ అలాగే పట్టణ ప్రాంతంలో నివసించే వారి యొక్క సంవత్సర కుటుంబ ఆధాయం అనేది రూ. 96 వేల కంటే మించరాదు.
బాలుడు లేదా బాలిక ఆధార్ కార్డ్
తల్లి ఆధార్ కార్డ్
తండ్రి ఆధార్ కార్డ్
బాలుడు లేదా బాలిక జనన ధృవీకరణ పత్రం
తల్లి లేదా తండ్రి మరణ ధృవీకరణ పత్రం
కుల దృవీకరణ పత్రం
ఆధాయపు ధృవీకరణ పత్రం
స్టడీ సర్టిఫికేట్
బాలుడు లేదా బాలిక వ్యక్తిగత బ్యాంకు అకౌంట్. లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులతో కలిసిన జాయింట్ బ్యాంకు అకౌంట్.
పైన తెలిపిన పత్రాలతో పాటు దరఖాస్తు ఫారంను మీకు సంబంధించిన సి.డి.పి.ఓ కార్యాలయంలో సమర్పించడం ద్వారా వారు అర్హత కలిగిన దరఖాస్తులు అన్నింటినీ జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ది మరియు సాధికారత అధికారి వారి కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ నుండి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆమోదం కొరకు పంపిస్తారు.