ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన అనేది అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత కోసం మరియు వారి యొక్క వృద్ధాప్య రక్షణ కోసం ఉద్దేశించి ప్రవేసపెట్టిన ప్రభుత్వ పథకం.
ఇది స్వచ్ఛంద మరియు సహకార పెన్షన్ పథకం, దీని కింద లబ్ధిదారుడు 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత నెలకు రూ. 3000/- కనీస హామీ పెన్షన్ను అందుకుంటారు మరియు లబ్ధిదారుడు మరణిస్తే, లబ్ధిదారుని జీవిత భాగస్వామి 50% పొందేందుకు అర్హులు (జీవిత భాగస్వామికి మాత్రమే వర్తిస్తుంది).
ఈ పథకంలో దరఖాస్తు చేసుకున్న వారు నెలకు రూ. 55 నుండి రూ. 200 మధ్య చెల్లించవలసి ఉంటుంది. దరఖాస్తుదారు 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత అతను/ఆమె పెన్షన్ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. ప్రతి నెలా నిర్దిష్ట పెన్షన్ మొత్తం సంబంధిత వ్యక్తి యొక్క పెన్షన్ ఖాతాలో జమ చేయబడుతుంది.
- ఆధార్ కార్డ్
- సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ / జన్ ధన్ అకౌంట్ నెంబర్ & IFSC కోడ్
- అసంఘటిత కార్మికులయుండాలి
- ప్రవేశ వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
- నెలవారీ ఆదాయం రూ. 15000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
- EPFO/NPS/ESIC లో సభ్యుడు అయ్యి ఉండకూడదు
- Income Tax Pay చేసే వారు అనర్హులు
రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకం కొరకు దరఖాస్తు చేసుకోవాలంటే మీకు దగ్గర లోని కామన్ సర్వీసు సెంటర్ లో లేదా అధికారిక వెబ్సైటు ద్వార దరఖాస్తు చేసుకోవచ్చు.